Friday, 6 January 2012

శాంతి చర్చలు ఒక మైలురాయి

- జి. హరగోపాల్
https://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/dec/30/edit/30edit2&more=2010/dec/30/edit/editpagemain1&date=12/30/2010
ఈ (21) శతాబ్దంలోని మొదటి దశాబ్ద సామాజిక అనుభవాన్ని అంచనా వేయడమంటే ఒక కోణంలో ఈ మొత్తం శతాబ్ద కాల అనుభవం ఎలా ఉండబోతున్నదనే అంచనా వేయడమే. ఈ దశాబ్దకాలంలో ప్రపంచం ఒక తీవ్ర ఆందోళనకు, ఉద్రిక్తతకు, అభద్రతకు గురైంది. ఆ ఉద్రిక్తతకు మానవాళి ఏమైనా సృజనాత్మ క, ప్రజాస్వామ్యబద్ధ పరిష్కారాలు కనుక్కొంటుందా లేక ప్రపం చం మరింత హింస, విధ్వంసంలో కూరుకుపోతుందా అన్న ఆం దోళన కలుగుతుంది. ఈ ఘర్షణకు మూలాలు ఎక్కడున్నాయి అని కనుక్కుంటే తప్ప మౌలిక పరిష్కారాలు సాధ్యం కావు.

సోవియట్‌యూనియన్ పతనం తర్వాత పెట్టుబడిదారీ వ్యవ స్థ తనకింక అదుపు, ఆజ్ఞలు లేవని భావిస్తున్నది. తనేం చేసినా చెల్లుతుందన్న అహంకారం సర్వత్రా కనిపిస్తున్నది. ప్రపంచీకర ణ అనే ముద్దుపేరుతో ప్రపంచాన్ని కబళించాలని ప్రయత్నిస్తున్న ది. ఎక్కడ ప్రకృతి వనరులున్నా అది పెట్రోల్ కావచ్చు, గనులు, నదులు కావచ్చు, అడవి కావచ్చు, ఆ సంపద మీద దేశ సరిహద్దులు దాటి, దేశాల సార్వభౌమాధికారాన్ని ధిక్కరించి తన ఆధిపత్యం కొరకు ఒక 'యుద్ధాన్నే' ప్రకటిస్తున్నది. ఆ యుద్ధానికి ఆయా దేశాధినేతలు, నాయకులు, మీడియా, ఆధిపత్య వర్గాలు వత్తాసు పలుకుతున్నాయి.

ఈ యుద్ధం లో పేదలు, శ్రామికులు, గిరిజనులు, మన దేశంలో దళితులు, రైతాంగం, స్త్రీలు, నిరుద్యో గ యువత అన్నిరకాల బలహీనులు గిలగిల కొట్టుకుంటున్నారు. ఈ కొట్టుకునే మనుషులు ఎలా తిరగబడతారు ఎలాంటి పద్ధతు లు ఎన్నుకుంటారు. ఎంత సమిష్టి గా, సమైక్యంగా ఉద్యమించగలుగుతారు ఈ మొత్తం అమానవీయమైన అభివృద్ధిని ఎంత చైతన్యంతో ప్రతిఘటిస్తారు అన్నదే ఈ శతాబ్ద చరిత్రను నిర్దేశిస్తుంది.

మన దేశ చరిత్రలో గత శతాబ్దం మొదటి అర్ధ భాగమంతా స్వాతంత్రోద్యమం సాగితే తరువాత అర్ధ భాగంలో ఆ స్వాతం త్య్ర ఫలితాలు కొందరే అనుభవిస్తూ వచ్చారు. ఫలితంగా అట్టడుగు ప్రజల జీవితాలు మౌలికంగా మారకపోవడంతో 1960 దశాబ్దాంతానికి భిన్నమైన ప్రజా ఉద్యమాలు ముందుకు వచ్చా యి. ఈ అన్ని ఉద్యమాలలో నక్సల్బరి విప్లవ ఉద్యమం గత నాలుగు దశాబ్దాలుగా ఎన్నో ఆటుపోట్లకు గురై ఒక చోట క్షీణిం చి, మరోచోట బలం పుంజుకుని శతాబ్దం చివరి దశలో 'దేశభద్రతకు ప్రధానమైన ప్రమాదం' అని దేశ ప్రధానమ్రంతి అనే దాకా విస్తరించింది.

ఎందుకు ఈ ఉద్యమమే దేశభద్రతకు ప్రధానమైన ముప్పు అంటున్నారు పార్లమెంటరీ పార్టీలు అన్నీ అంగీకరించి న ప్రపంచీకరణ అభివృద్ధి నమూనాను ప్రశ్నిస్తున్న బలమైన ఉద్యమాలలో ఈ ఉద్యమం అగ్రభాగాన ఉంది కాబట్టి. ఈ దశాబ్దమంతా సీరియస్ రాజకీయ చర్చ దీని చుట్టే జరిగింది, జరుగుతున్నది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో (రాష్ట్రం వచ్చే దశాబ్దం లో ఈ రూపంలో ఉండకపోవచ్చు) జరిగిన పరిణామాలు, ప్రయోగాలు నా దృష్టిలో చాలా చారిత్రకమైన ఘట్టాలు.

గత శతాబ్దం చివరి దశలో రైతాంగ ఉద్యమాలు ముఖ్యంగా నక్సలైట్ ఉద్యమం హింసా వలయంలో ప్రాణనష్టం పెరిగిపోవ డం ఒక ఆందోళనకరమైన విషయమే! నిజానికి ఈ ఉద్యమం ప్రారంభమైన ఉత్తర ఆంధ్రలో కాని తర్వాత విస్తరించిన ఉత్తర తెలంగాణలో కానీ అది ఒక ప్రగాఢమైన ప్రభావాన్ని వేసింది. అన్ని రంగాల మీద పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఈ ఉద్యమ ప్రభావం ఉంది. ఈ ఉద్యమ అంతిమ లక్ష్యం (నా అవగాహన లో) ఒక మానవీయ సమాజాన్ని నిర్మించడం లేదా ఒక నూతన మానవుణ్ణి సృష్టించడం.

సోవియట్ యూనియన్ ప్రయోగ వైఫ ల్యం, చైనాలో అభివృద్ధి వికృతీకరింపబడడంతో, మార్పు ఆలస్యమైనా ఉద్యమ దశలో జరగాలే కాని తర్వాత దశలో జరుగుతుందనుకోవడానికి చారిత్రక ఆధారాలు లేకుండాపోతున్నాయి. ఈ అవగాహన ఏదో ఒక రూపంలో, ఏదో ఒక స్థాయిలో మన రాష్ట్రంలో జరిగిన శాంతి చర్చల్లో అంతర్లీనంగా ఉంది అని భావి స్తే తప్ప శాంతి చర్చల ప్రాముఖ్యత పూర్తిగా అర్థం కాదు.

పౌరస్పందన వేదిక శాంతి చర్చల కృషి తన కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. ఈ ప్రయోగం మధ్యలో వచ్చిన ఆలోచన. ప్రయోగం ప్రారంభం కావడానికి నేపథ్యం- పెరుగుతున్న రాజ్యహింస, దానికి ప్రతిగా విప్లవ ఉద్యమాల స్పందన లేదా ప్రతిహింస. ఉద్యమం అంటే కేవలం ఆయుధాలు, హింస అనే ప్రచా రం విస్తృతంగా జరిగింది, దానికి ఉద్యమాలు చేసిన పొరపాటు, తప్పిదాలు కూడా దోహదపడ్డాయి.

ఈ పొరపాట్లను ఉద్యమాలు అంగీకరిస్తూ వస్తున్నాయి కూడా! ఈ ఘర్షణలో పౌర సమాజాని ది కేవలం ప్రేక్షక పాత్రనా లేక సమాజం కూడా దీన్ని పట్టించుకోవాలా అన్న ప్రశ్న ఈ ప్రయత్నం వెనక లేదా ప్రయత్నంలో భాగంగా ఉంది. సమాజంలో ఉండే ప్రజాస్వామ్య శక్తులు నిశ్శబ్దంగా ఉంటే అది సమాజానికి చాలా హాని చేస్తుంది అన్నది ఇందులో ప్రధానం... అందుకే ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడినప్పుడు సమాజం కూడా దాన్ని పట్టించుకుని చొరవ తీసుకోవా లి అన్న ఒక బలమైన ప్రజాస్వామిక సూత్రం ఈ ప్రయత్నంలో ఉంది.

ఆరకంగా శాంతి చర్చల ప్రక్రియ ఈ దశాబ్దంలో జరిగిన ఘటనలలో చాలా విలువైంది. శాంతి చర్చలు ఏం సా««ధించాయి అనే ప్రశ్న ముందుకు రావ చ్చు. శాంతిచర్చల వల్ల ఉద్యమాలకు విఘాతం కలిగింది అనే వాదన ఉండవచ్చు. రాజ్యమే ఈ ప్రయోగం నుండి ఎక్కువ ప్రయోజనాన్ని పొందింది అని అనవచ్చు, ప్రజాస్వామ్యవాదుల ప్రయత్నాన్ని, వాళ్ళ ఆకాంక్షలని తప్పుపట్టవచ్చు. ఇవన్నీ ప్రయో గ వైఫల్యం తర్వాత వచ్చిన వాదనలు.

అయితే సుదీర్ఘ సామాజిక చరిత్రలో లేదా భౌతిక శాస్త్రాల పరిణామంలో ప్రయోగం చేసేప్పుడు కచ్చితంగా ఫలితాల గురించి చెప్పలేరు. ఒక చరిత్రకారుడు అన్నట్లు విప్లవాలు వస్తాయని కచ్చితమైన నిర్ధారణ చేయగలిగితే, అవి ఏ దశాబ్దంలో లేదా సంవత్సరంలో వస్తాయి అని చెప్పగలిగితే విప్లవాలను తప్పకుండా నివారించేవారే అంటాడు. మౌలిక మార్పులు ఎప్పుడు, ఎలాంటి దశలో వస్తాయో అది అనుభవంలో వస్తుంది కాని కచ్చితంగా చెప్పిరాదు.

కనుక ఈ మొత్తం ప్రక్రియలో భిన్న ప్రయోగాలు జరుగుతుంటాయి, సమాంతరంగా చాలా ఉద్యమాలు వస్తుంటాయి. మన రాష్ట్రం లో దళిత ఉద్యమాలు, స్త్రీవాద ఉద్యమాలు, పౌరహక్కుల ఉద్యమాలు, కులవివక్ష వ్యతిరేక ఉద్యమాలు, కులనిర్మూలన ఉద్యమాలు- ఇలా భిన్న ఉద్యమాలు జరుగుతున్నాయి. ఏ ఉద్యమస్థానం దానిది. ప్రతి ఉద్యమానికి పరిమితులున్నాయి,

ఈ పరిమితులు చారిత్రక పరిమితులే కావచ్చు, ఉద్యమాల్లో పనిచేస్తున్న వ్యక్తుల పరిమితులే కావచ్చు, భిన్నమైన బలహీనతలే కావచ్చు- వీటన్నింటితోనే ఉద్యమాలు నడుస్తుంటాయి. ఈ ఉద్యమాలన్నీ భవిష్యత్తులో సమిష్టి ఉద్యమాలుగా మారుతాయా తెలియదు. అన్ని ఉద్యమాలలో కొన్ని ప్రజాస్వామ్య, మానవీయ ఆకాంక్షలుంటాయి. ఆ ఆకాంక్షలను గుర్తించడం చాలా అవసరం. ఈ అన్ని ప్రయోగాల లాగే పౌరస్పందన వేదికది కూడా ఒక ప్రయోగమే.

ఈ ప్రయోగంలో సమాజ మార్పు తక్కువ హింసతో జరగా లి (ఎకానమైజింగ్ వయొలెన్స్) అన్నది ఒక ఆకాంక్ష. దీంట్లో రాజ్యం చేస్తున్న హింస చాలా ప్రమాదకరం. ఆ హింస మీద సమాజ నియంత్రణ లేకపోతే అది ఏ స్థాయికైనా వెళ్లవచ్చు. అలాంటి దృష్టాంతాలు చరిత్ర నిండా ఉన్నాయి. రాజ్యం ఉద్భవించడానికి ప్రధాన కారణం సమాజంలో ఉండే వ్యవస్థాపర హింసను తగ్గించడానికి అని ఉదారవాద సిద్ధాంతం (లిబరల్ థియరీ) వాదిస్తుంది.

కాని నిజానికి జరిగింది వ్యవస్థాపర హింస ను కాపాడడమే కాకుండా ప్రోత్సహిస్తూ ఆ మిష మీద తన హింసను పెంచుతూ పోయింది. అందుకే మానవ నాగరికతలో రాజ్యం ఒక పరిష్కారం కాకుండా, అదొక సమస్యై కూర్చుంది. ఈ రాజ్యహింస గురించి సమాజం చర్చించాలి, కార్యకారణ సంబంధాలను తెలుసుకోవాలి. రాజ్యం మీద సమాజం తన నియంత్రణను కోల్పోకూడదు. కాని రాజ్యం ఉద్యమాలలో జరిగే హింస బూచిని చూపించి తన హింసను పెంచుతూ పోతుంటుంది.

ఉద్యమాలలో ఒక ప్రజాస్వామ్య ఆకాంక్ష ఉందని, సామాజిక మార్పు కొరకు అవి ఘర్షణ పడుతున్నాయన్నది సమాజం పూర్తి గా మరచిపోయేంత ప్రచారం చేస్తుంది. ఆ దిశలో ఉద్యమాలు ఏం కాంక్షిస్తున్నాయో సమాజం మరొకసారి గుర్తించడానికి, ఉద్యమాలు తమ ఆశయాలు, లక్ష్యాలు ఏమిటో సమాజానికి చెప్పడానికి శాంతి చర్చల ప్రయోగం ఒక ఆహ్వానించవలసిన మార్గం. ఇంకా ఇతర మార్గాలు ఏమైనా ఉన్నాయా అన్నది శోధించవలసి ఉన్నది.

ఈ ప్రయోగం విఫలమైన మాట నిజమే. అయితే ఈ చర్చలు ప్రారంభించినప్పుడే ప్రతినిధులు అయినను పోయిరావలె హస్తినకు'' అని ముందే అన్నారు. కనుక వైఫల్యం అనూహ్యమయిందేమీ కాదు. చర్చల వల్ల మన రాష్ట్రంలో ఉద్యమం దెబ్బతిన్నదా అనే అంశం మీద అంచనా వేయడానికి ఇంకా చాలాకాలం పడుతుంది. కాని ఇది ఈ దశాబ్దంలోనే ఒక ప్రధానమైన ఘట్టం అనడానికి కారణం, శాంతి చర్చల ప్రస్తావన జాతీయ స్థాయిలో రావడం.

చత్తీస్‌గఢ్, జార్ఖండ్ లేదా ఒరిస్సా, బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రు లు కూడా ఈ ప్రయోగం గురించి మాట్లాడడం. ఘర్షణ తీవ్రతరం అయినకొద్దీ శాంతి చర్చల ప్రస్తావన పెద్దయెత్తున జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుం దా లేదా, వాళ్ళకు చిత్తశుద్ధి ఉందా లేదా అన్నది ప్రశ్నకాదు, హింస పాత్ర ను తగ్గించడానికి ఇదొక ప్రత్యామ్నాయమని భిన్నమైన స్థాయిల లో గుర్తించడం ఒక కీలకమైన పరిణామం.

కేంద్ర ప్రభుత్వమే కాక మావోయిస్టు పార్టీ ప్రతినిధి ఆజాద్ రాసిన చివరి లేఖలో కూడా చత్తీస్‌గఢ్ గిరిజనుల నిత్యజీవిత అనిశ్చితుల దృష్ట్యా వాళ్ల కు ఊపిరి పీల్చుకునే అవకాశం కొరకు తమ పార్టీ ఒక అడుగు వెనక్కి వెయ్యడానికి సిద్ధంగా ఉందని, ఈ భాషలో కాకున్నా ఈ స్ఫూర్తి ఆ లేఖలోఉంది.

రాష్ట్రంలో శాంతిచర్చలు విఫలమై, ఉద్యమం దెబ్బతిన్నది అన్న వాస్తవం గుర్తించినా, మావోయిస్టు పార్టీ శాం తిచర్చల ప్రస్తావన జాతీయ స్థాయిలో చేయడం, ఆ ప్రయత్నం ప్రజాస్వామ్యవాదులు చేయాలని కోరడం, దానికి స్వామి అగ్నివేష్, బి.డి.శర్మ, అరుంధతిరాయ్ లాంటి వాళ్ళను ప్రతినిధులు గా కోరుకోవడం, రాష్ట్ర స్థాయి చర్చల్లో మధ్యవర్తిగా పాల్గొన్న నాలాంటి వాళ్ళకు ఒక సంతృప్తిని కలిగించింది. మన రాష్ట్రంలో ఈ ప్రయత్నమే జరగకపోతే జాతీయ స్థాయిలో ఈ ప్రత్యామ్నాయమున్నదని ఎలా తెలిసేది

శాంతి చర్చల వల్ల మావోయిస్టు లేదా ఇతర విప్లవ ఉద్యమాలు దెబ్బతిన్నాయి అన్నది ఎంత వాస్తవమో ప్రజలలో ఉద్యమస్ఫూర్తి దెబ్బతినలేదు అనడానికి విస్తృతంగా జరుగుతున్న సజీవ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సాక్ష్యం. ఉద్యమాల రూపం వేరుండవచ్చు కాని సారంలో ఒక ప్రజాస్వామ్య తెలంగాణ కావాలన్న ఆకాంక్ష బలంగానే ఉంది. ఇందులో విప్లవ రాజకీయాలను అభిమానించే ఎంతో మంది క్రియాత్మకమైన పాత్రను నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఒక బలమైన ప్రజాస్వామ్య ఆకాంక్ష ఉండడానికి, మిగతా అన్ని ఉద్యమాల పాత్ర ఉన్నదన్నది కూడా ఒక నిజం.

- జి. హరగోపాల్

No comments:

Post a Comment