శివసాగర్ కవిత్వం, కొండపల్లి సీతారామయ్య(కెఎస్) పై సంచలన వార్తలు, త్రిపురనేని మధుసూదనరావు (టీఎమ్మెస్) మాటలు, గద్దర్ పాటలు - మా యువతరాలను మండించిన కాలం ఒకటుంది. పై నాలుగింటిలో ఆఖరు మూడు ఇంధనాలు నేరుగా మాలో విప్లవావేశం రగిలిస్తే, శివసాగర్ కవిత్వం రోడ్ల పక్క జనసందోహం మధ్య గోడలమీద నుంచి నిలువెత్తు నినాదాలై భావావేశంలోకి లాక్కుపోయేది.
కసితో స్వార్థం శిరస్సు గండ్రగొడ్డలితో నరకగల్గినవాడే
నేటి హీరో
ప్రజల గుండెల కొండల్లో మాటు కాసి
ట్రిగ్గర్ నొక్కగలిగిన వాడే ద్రష్ట
ప్రజల్ని సాయుధం చేస్తున్న రివల్యూషనరీ
నేడు కవి (' మైక్రోస్కోపిక్ 'నుంచి )
అలలు కనే కలలపైన నిఘా! అలలపై అనురాగం చూపించే
చిరుగాలి సితారా సంగీతంపై నిఘా!
అలల నెవ్వరడ్డగలరు కడలి నెవ్వడాపగలడు ('అలలు' నుంచి)
పులి గుహలోకి వెళ్ళ సాహసించిన వాడే
పులి పిల్లను పట్టి తెస్తాడు వెయ్యి కత్తి వేట్లకు జంకని వాడే
రాజుని పదవీ భ్రష్టుణ్ణి చేస్తాడు (ఉద్యమం నెలబాలుడు నుంచి )
ఉరికంబం మీద నిలిచి ఊహాగానం చేసెద
నా ఊహల ఉయ్యాలలోన మరో జగతి
ఊసులాడు (భూమయ్య కిష్టగౌడ్లకు ఉరిశిక్ష విధించినపుడు)
న్యాయమూర్తులంగారూ! సూర్యోదయం కుట్ర కాదు
సూర్యుడు కుట్రదారుడు కాదు
శ్రీకాకుళం సూర్యోదయం కుట్ర కాదు
గెరిల్లా సూర్యుడు కుట్రదారుడు కాదు
(పార్వతీపురం కుట్రకేసులో కోర్టు స్టేట్మెంట్)
ఈ కవితా నినాదాల ఆకర్షణ నుంచి బయటపడలేక, పడలేక, వాటిని మళ్లీ మా హాస్టల్ గోడలమీద, గదుల లోపలిగోడలమీద రాసుకునేవాళ్లం. వాటిని చూస్తూ చూస్తూ కాగి మసలుతుండేవాళ్లం. కానీ కేఎస్ గురించి తెలిసినంతగా, టీఎమ్మెస్ గురించి తెలిసినంతగా, గద్దర్ గురించి తెలిసినంతగా, శివసాగర్ గురించి తెలీదు. ఎందుకంటే ఆ నినాదాల కింద పీపుల్స్వార్ అనీ, రాడికల్ విద్యార్థి సంఘం అనీ రాసేవారు. మేము కూడా అలానే రాసుకుపోయేవాళ్లం. కవిత్వంలోని నిగూఢత లాగే, రహస్యోద్యమంలోని నిగూఢత లాగే, ఆ కవి కూడా పరమ నిగూఢంగా ఉండిపోయాడు
విద్యార్థి దశ దాటింది. ఈ లోగానే కొందరం కవులుగా, కొందరం విప్లవకారులుగా మార్పు చెందాము. కొంతకాలానికి... ఉద్యమం లోపలేదో గడబిడ . కేఎస్ పేరుతో పాటు, ఎస్ఎమ్ అని మరో పేరు వినిపించేది, అప్పటికీ ఎస్ఎం అంటే సత్యమూర్తి అనీ, సత్యమూర్తి అంటే శివసాగర్ అనీ ఎవరూ తెలపలేదు. మేమూ అడగలేదు. అది రహస్యోద్యమం కదా! ఉత్తేజం మాత్రమే ప్రవహిస్తుంది చేగువేరాలా.
ఇంతలో 'ఉదయం' దినపత్రికలో కేజీ సత్యమూర్తి ఇంటర్వ్యూ సీరియల్గా రాసాగింది. అప్పటికి గానీ మామూలు మనుషుల్ని విప్లవకారులుగా మార్చిన నినాదాలు శివసాగర్వనీ, ఆయనే కేజీ సత్యమూర్తి అనీ తెలిసిరాలేదు.
అజ్ఞాతం లోంచి...
హౖౖెదరాబాద్లోని అంబర్పేట రాణాప్రతాప్ హాలులో విప్లవ రచయితల సంఘం ద్విదశాబ్ది సభలు. కేజీ సత్యమూర్తి అజ్ఞాతం వీడినట్లు రేడియో వార్తలు మాలో అల్లుకుంటుండగా, నేరుగా ఆయనే సభల ముఖద్వారం వద్ద ప్రత్యక్షమయ్యారు. అది తెలిసి లోపల్నుంచి పరుగులు తీశాం. ఆయనే.. శివసాగరే...శివసాగరే...శివసాగరే. ఉద్విగ్నులమయ్యాం. వివశులమయ్యాం. కావిలించుకునేంత పని చేశాం..
ఆ రోజు రాత్రి మొదలై, మరుసటి రోజు తెల్లవారేదాకా ఆయనపై జనరల్ బాడీ. దాదాపు సభ్యులందరూ ఆయనపై నోరు చేసుకున్నారు. తప్పులు ఎత్తి చూపారు. చివరకు తన వంతు బదులు చెప్పుకునే అవకాశం ఆయనకు వచ్చింది. అపుడు గంటల కొద్దీ ఆయన చేసిన ప్రసంగంలో రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఏవీ నాకు ఇప్పుడు పెద్దగా గుర్తు లేవు. ఆరోపణలు, ప్రత్యారోపణలు అసలే గుర్తులేవు. కానీ ఆ ప్రసంగంలో 'ఆర్టిస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పొయిట్రీ' గురించి ఆయన చెప్పిందే గుర్తుండిపోయింది. జీవితంలోని వివిధ సందర్భాలను కవిత్వంలోకి ఎలా తర్జుమా చేయాలనేది దాని సారం. అంతసేపూ ఆరోపణలు గుప్పించిన వారు కూడా మంత్రముగ్ధులై అది విన్నారు. విప్లవకారులు ప్రేమ గురించి ఎందుకు రాయరు, ఎన్నో చీకటి కోణాలను ఎందుకు పట్టించుకోరు అని ఆయన వేసిన ప్రశ్నలు మాకు చాలా ప్రయోజనం కలిగించాయి.
'ప్రమాద సంగీతం' అలా పుట్టిందే
ఆ ప్రశ్నలు వెంటాడాయి. విప్లవ కవిత్వంలో మొనాటనీ బ్రేక్ చేయవలసిన అవసరం తెలిసింది.
ప్రేమలు నిజమే, ప్రేమల పంచవన్నెల రామచిలక నిజమే
ప్రేమల ధృవాల మధ్య నగరాలు తగలబడిపోయే ఆకర్షణ నిజమే
రాజకీయాలు లేని ప్రేమలు నమ్మలేము- ('ప్రేమజెండా' నుంచి)
ఇలాంటి కవిత అనంతరకాలంలో రూపుదిద్దుకుంది. అప్పటిదాకా జీవితంలో విస్మరించిన అంశాలను కవిత్వం చేయసాగాము. కొత్తది ఏదైనా ఎక్కడినుంచో ఊడిపడదు. నా ప్రమాద సంగీతం కవిత్వం అలా రూపుదిద్దుకున్నదే, మరి కొందరి కవిత్వంలాగా.
ప్రతి ఒక్కరికీ ఒక అదృష్టం తలుపు తడుతుంది. అది నా తలుపూ తట్టింది. సోవియట్ రష్యా పతనం, తూర్పు యూరప్ పరిణామాలు, తాజాగా పీపుల్స్వార్పై నిషేధం, విప్లవపంథాలో చీలికలు. అష్టకష్టాలకాలం. అదే సందర్భంలో నా పుస్తకం 'ప్రమాద సంగీతం'గా వచ్చింది. గుంటూరులో విరసం సభలు. విప్లవ రాజకీయవివాదాల మధ్య శివసాగర్ విరసం వేదిక ఎక్కారు. నా కవిత్వం ఆవిష్కరించారు. ఆ వేదికకు ఆయన రావడం అదే ఆఖరు. ఇన్ని వివాదాల వల్ల.. ఆ ఆవిష్కరణే రాష్ట్ర వ్యాప్త వార్తలా వచ్చింది.
'హో' సభకు శివసాగర్
మన కాలం వీరుడు త్రిపురనేని శ్రీనివాస్ ప్రమాద మరణం తరువాత అతడి పుస్తకం హో తెచ్చాం. ఆ పుస్తకం ఒక సంచలనం, ఆ పుస్తక సభ మరో సంచలనం. సభికులకు ఎద్దు బిరియాని వడ్డిస్తున్నట్లు తిరుపతిలో కరపత్రాలు పంచాం. రాష్ట్రంలో ముఖ్యప్రాంతాలకు పంపిణీ చేశాం. ఆ సభలో శివసాగర్ 'దళిత సౌందర్యశాస్త్రం' ఉపన్యాసకుడు. దళిత సాహిత్యం కుప్పలుతెప్పలుగా వచ్చిన ఎంతో కాలానికి ఈ కింది కవితలు రాసినా, నవ యవ్వనుడిగా ఆ సాహిత్యానికి అంత వయసులోనూ నాయకత్వం వహించి, తెలుగుసాహిత్యంలో దళిత సౌందర్యశాస్త్రానికి తొలి గురువు అయ్యారు.
మండే మాదిగ డప్పులా ఉదయిస్తోన్న సూరీడుపై
చిర్రా, చిటికెన పుల్లా తీసుకుని తొలకరి పాటకు దరువేస్తున్నాను
(మండుతోన్న మాదిగడప్పు నుంచి)
కాలం కసాయి కత్తిమీద నిలబడి గర్జిస్తున్న ఛండాలుడు
ఆది శంకరునిపై నాలుగు వేట కుక్కల్ని ఉసిగొల్పుతున్నాడు
ఓహో..! ఇప్పుడు నడుస్తున్న చరిత్ర
పరమ ఛండాల చ రిత్ర (దళిత మేనిఫెస్టో నుంచి)
నల్ల నల్ల సూరీడు నల్లాటి సూరీడు
నలుపు నలుపు సూరీడు
గెలుపుదారి సూరీడు
(నల్ల సూరీడు నుంచి)
కవితాయాత్రలో
2004 సెప్టెంబరులో శివసాగర్ కవిత్వం, ఒంటరి యుధ్ధమే-జీవితోత్సవం (నా రెండో పుస్తకం) ఒకేసారి రావడం అనుకోకుండా జరిగిన సాహిత్య ఘటన. అప్పటికి నేను కవితాయాత్రకు సిద్ధమయ్యాను. ఆయన ఎవరో తెలియకుండా ఏళ్లుగా, ఆయనను చూడాలని ఏళ్లుగా తపించిన నేను ఆయనతో కలిసి కవితాయాత్ర చేసే అవకాశం వచ్చింది. అన్నీ మరిచి కవిత్వం కోసమే సంచరించిన కాలమది. రెండు, మూడు నెలలపాటు ఇద్దరం యాత్ర చేశాం. నల్లగొండ నుంచి కరీంనగర్ మీదుగా గుంటూరులోని చుండూరు వరకు. ఆ అనుభవాలు మధురమైనవి, మరచిపోలేనివి. ఆయన నుంచి, కవిత్వం నుంచి నేను పొందిన అపురూపమైన బహుమతి అది. ఒక రకంగా నా పునరుత్థానం అది. ఫీనిక్స్ పక్షిలా మరో పుట్టుక అది.
ఆయన కోర్కెలు
ఆ నిరాడంబర జీవికి, అందం అంటే అడవి అంటే ప్రాణం అనుకునే అయనకు రెండు కోర్కెలు ఉన్నాయి. అవి నెరవేరకుండానే పోయాడాయన. ఒకటి- అరవిందుడి 'సావిత్రి' ప్రేరణతో మరో సావిత్రి రాయాలన్నది. రెండు-ఏ ఆదిలాబాద్ ఆదివాసుల కోసం పనిచేశాడో వారి దగ్గరే తన సమాధిని ఏర్పాటు చేయాలన్నది.
ముగింపు
ఈనెల 17న ఒక విప్లవ నేత, బహుజన నాయకుడు, రెవల్యూషనరీ రొమాంటిస్టు మరణించారు. ఆయన చుట్టూ చేరి ఎందరో ఆయనకు వీడ్కోలు పలికాము. ఇక ..షరా మామూలే. ఎవరిపనిలో వారు. శ్రీశ్రీ అన్నట్లు 'ఆకాశం పడిపోకుండానే ఉంది'
ఎన్ని అద్భుత ఘటనలు జరిగినా, ఎన్ని విషాద ఘటనలు జరిగినా. ఎన్ని వీరోచిత ఘటనలు జరిగినా ఆ క్షణంలోనే ఆవిరవుతున్నాయి. స్పందన లేమి ఈ యుగ లక్షణమైపోయింది.
అన్నీ దారి తప్పాయి. అన్ని వ్యవస్థలూ దారి తప్పాయి. నివాసయోగ్యమైన భూమిని 'నరక'ప్రాయం చేసుకున్నాము. 2099 నాటికి 6 డిగ్రీల సెంటీగ్రేడు భూఉష్ణోగ్రత పెంచాలని పరుగులు తీస్తున్నారు. ఈ విధ్వంసం ఆగదు. తప్పదు. కొత్తది మొలకెత్తక తప్పదు. నూత్న మానవుడు పుట్టక తప్పదు. మరో చేగువేరా కోసం, మరో శివసాగర్ కోసం, మరో బాలగోపాల్ కోసం, మరో సాహు కోసం, మరో జార్జి కోసం, మరో భ గత్సింగ్ కోసం కాలం కడుపుతో ఉన్నది.
సూర్యాస్తమయం వృథా కాదు
సూర్యోదయం జరిగితీరుతుంది
తల్లి ప్రసవ వేదన వృథా కాదు
నూతన శిశువు జనిస్తుంది
- యింద్రవెల్లి రమేష్
99854 40002
నివాళి
http://www.andhrajyothy.com/sundaypageshow.asp?qry=2012/apr/29/sunday/nivali&more=2012/apr/29/sunday/sundaymain
కసితో స్వార్థం శిరస్సు గండ్రగొడ్డలితో నరకగల్గినవాడే
నేటి హీరో
ప్రజల గుండెల కొండల్లో మాటు కాసి
ట్రిగ్గర్ నొక్కగలిగిన వాడే ద్రష్ట
ప్రజల్ని సాయుధం చేస్తున్న రివల్యూషనరీ
నేడు కవి (' మైక్రోస్కోపిక్ 'నుంచి )
అలలు కనే కలలపైన నిఘా! అలలపై అనురాగం చూపించే
చిరుగాలి సితారా సంగీతంపై నిఘా!
అలల నెవ్వరడ్డగలరు కడలి నెవ్వడాపగలడు ('అలలు' నుంచి)
పులి గుహలోకి వెళ్ళ సాహసించిన వాడే
పులి పిల్లను పట్టి తెస్తాడు వెయ్యి కత్తి వేట్లకు జంకని వాడే
రాజుని పదవీ భ్రష్టుణ్ణి చేస్తాడు (ఉద్యమం నెలబాలుడు నుంచి )
ఉరికంబం మీద నిలిచి ఊహాగానం చేసెద
నా ఊహల ఉయ్యాలలోన మరో జగతి
ఊసులాడు (భూమయ్య కిష్టగౌడ్లకు ఉరిశిక్ష విధించినపుడు)
న్యాయమూర్తులంగారూ! సూర్యోదయం కుట్ర కాదు
సూర్యుడు కుట్రదారుడు కాదు
శ్రీకాకుళం సూర్యోదయం కుట్ర కాదు
గెరిల్లా సూర్యుడు కుట్రదారుడు కాదు
(పార్వతీపురం కుట్రకేసులో కోర్టు స్టేట్మెంట్)
ఈ కవితా నినాదాల ఆకర్షణ నుంచి బయటపడలేక, పడలేక, వాటిని మళ్లీ మా హాస్టల్ గోడలమీద, గదుల లోపలిగోడలమీద రాసుకునేవాళ్లం. వాటిని చూస్తూ చూస్తూ కాగి మసలుతుండేవాళ్లం. కానీ కేఎస్ గురించి తెలిసినంతగా, టీఎమ్మెస్ గురించి తెలిసినంతగా, గద్దర్ గురించి తెలిసినంతగా, శివసాగర్ గురించి తెలీదు. ఎందుకంటే ఆ నినాదాల కింద పీపుల్స్వార్ అనీ, రాడికల్ విద్యార్థి సంఘం అనీ రాసేవారు. మేము కూడా అలానే రాసుకుపోయేవాళ్లం. కవిత్వంలోని నిగూఢత లాగే, రహస్యోద్యమంలోని నిగూఢత లాగే, ఆ కవి కూడా పరమ నిగూఢంగా ఉండిపోయాడు
విద్యార్థి దశ దాటింది. ఈ లోగానే కొందరం కవులుగా, కొందరం విప్లవకారులుగా మార్పు చెందాము. కొంతకాలానికి... ఉద్యమం లోపలేదో గడబిడ . కేఎస్ పేరుతో పాటు, ఎస్ఎమ్ అని మరో పేరు వినిపించేది, అప్పటికీ ఎస్ఎం అంటే సత్యమూర్తి అనీ, సత్యమూర్తి అంటే శివసాగర్ అనీ ఎవరూ తెలపలేదు. మేమూ అడగలేదు. అది రహస్యోద్యమం కదా! ఉత్తేజం మాత్రమే ప్రవహిస్తుంది చేగువేరాలా.
ఇంతలో 'ఉదయం' దినపత్రికలో కేజీ సత్యమూర్తి ఇంటర్వ్యూ సీరియల్గా రాసాగింది. అప్పటికి గానీ మామూలు మనుషుల్ని విప్లవకారులుగా మార్చిన నినాదాలు శివసాగర్వనీ, ఆయనే కేజీ సత్యమూర్తి అనీ తెలిసిరాలేదు.
అజ్ఞాతం లోంచి...
హౖౖెదరాబాద్లోని అంబర్పేట రాణాప్రతాప్ హాలులో విప్లవ రచయితల సంఘం ద్విదశాబ్ది సభలు. కేజీ సత్యమూర్తి అజ్ఞాతం వీడినట్లు రేడియో వార్తలు మాలో అల్లుకుంటుండగా, నేరుగా ఆయనే సభల ముఖద్వారం వద్ద ప్రత్యక్షమయ్యారు. అది తెలిసి లోపల్నుంచి పరుగులు తీశాం. ఆయనే.. శివసాగరే...శివసాగరే...శివసాగరే. ఉద్విగ్నులమయ్యాం. వివశులమయ్యాం. కావిలించుకునేంత పని చేశాం..
ఆ రోజు రాత్రి మొదలై, మరుసటి రోజు తెల్లవారేదాకా ఆయనపై జనరల్ బాడీ. దాదాపు సభ్యులందరూ ఆయనపై నోరు చేసుకున్నారు. తప్పులు ఎత్తి చూపారు. చివరకు తన వంతు బదులు చెప్పుకునే అవకాశం ఆయనకు వచ్చింది. అపుడు గంటల కొద్దీ ఆయన చేసిన ప్రసంగంలో రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఏవీ నాకు ఇప్పుడు పెద్దగా గుర్తు లేవు. ఆరోపణలు, ప్రత్యారోపణలు అసలే గుర్తులేవు. కానీ ఆ ప్రసంగంలో 'ఆర్టిస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పొయిట్రీ' గురించి ఆయన చెప్పిందే గుర్తుండిపోయింది. జీవితంలోని వివిధ సందర్భాలను కవిత్వంలోకి ఎలా తర్జుమా చేయాలనేది దాని సారం. అంతసేపూ ఆరోపణలు గుప్పించిన వారు కూడా మంత్రముగ్ధులై అది విన్నారు. విప్లవకారులు ప్రేమ గురించి ఎందుకు రాయరు, ఎన్నో చీకటి కోణాలను ఎందుకు పట్టించుకోరు అని ఆయన వేసిన ప్రశ్నలు మాకు చాలా ప్రయోజనం కలిగించాయి.
'ప్రమాద సంగీతం' అలా పుట్టిందే
ఆ ప్రశ్నలు వెంటాడాయి. విప్లవ కవిత్వంలో మొనాటనీ బ్రేక్ చేయవలసిన అవసరం తెలిసింది.
ప్రేమలు నిజమే, ప్రేమల పంచవన్నెల రామచిలక నిజమే
ప్రేమల ధృవాల మధ్య నగరాలు తగలబడిపోయే ఆకర్షణ నిజమే
రాజకీయాలు లేని ప్రేమలు నమ్మలేము- ('ప్రేమజెండా' నుంచి)
ఇలాంటి కవిత అనంతరకాలంలో రూపుదిద్దుకుంది. అప్పటిదాకా జీవితంలో విస్మరించిన అంశాలను కవిత్వం చేయసాగాము. కొత్తది ఏదైనా ఎక్కడినుంచో ఊడిపడదు. నా ప్రమాద సంగీతం కవిత్వం అలా రూపుదిద్దుకున్నదే, మరి కొందరి కవిత్వంలాగా.
ప్రతి ఒక్కరికీ ఒక అదృష్టం తలుపు తడుతుంది. అది నా తలుపూ తట్టింది. సోవియట్ రష్యా పతనం, తూర్పు యూరప్ పరిణామాలు, తాజాగా పీపుల్స్వార్పై నిషేధం, విప్లవపంథాలో చీలికలు. అష్టకష్టాలకాలం. అదే సందర్భంలో నా పుస్తకం 'ప్రమాద సంగీతం'గా వచ్చింది. గుంటూరులో విరసం సభలు. విప్లవ రాజకీయవివాదాల మధ్య శివసాగర్ విరసం వేదిక ఎక్కారు. నా కవిత్వం ఆవిష్కరించారు. ఆ వేదికకు ఆయన రావడం అదే ఆఖరు. ఇన్ని వివాదాల వల్ల.. ఆ ఆవిష్కరణే రాష్ట్ర వ్యాప్త వార్తలా వచ్చింది.
'హో' సభకు శివసాగర్
మన కాలం వీరుడు త్రిపురనేని శ్రీనివాస్ ప్రమాద మరణం తరువాత అతడి పుస్తకం హో తెచ్చాం. ఆ పుస్తకం ఒక సంచలనం, ఆ పుస్తక సభ మరో సంచలనం. సభికులకు ఎద్దు బిరియాని వడ్డిస్తున్నట్లు తిరుపతిలో కరపత్రాలు పంచాం. రాష్ట్రంలో ముఖ్యప్రాంతాలకు పంపిణీ చేశాం. ఆ సభలో శివసాగర్ 'దళిత సౌందర్యశాస్త్రం' ఉపన్యాసకుడు. దళిత సాహిత్యం కుప్పలుతెప్పలుగా వచ్చిన ఎంతో కాలానికి ఈ కింది కవితలు రాసినా, నవ యవ్వనుడిగా ఆ సాహిత్యానికి అంత వయసులోనూ నాయకత్వం వహించి, తెలుగుసాహిత్యంలో దళిత సౌందర్యశాస్త్రానికి తొలి గురువు అయ్యారు.
మండే మాదిగ డప్పులా ఉదయిస్తోన్న సూరీడుపై
చిర్రా, చిటికెన పుల్లా తీసుకుని తొలకరి పాటకు దరువేస్తున్నాను
(మండుతోన్న మాదిగడప్పు నుంచి)
కాలం కసాయి కత్తిమీద నిలబడి గర్జిస్తున్న ఛండాలుడు
ఆది శంకరునిపై నాలుగు వేట కుక్కల్ని ఉసిగొల్పుతున్నాడు
ఓహో..! ఇప్పుడు నడుస్తున్న చరిత్ర
పరమ ఛండాల చ రిత్ర (దళిత మేనిఫెస్టో నుంచి)
నల్ల నల్ల సూరీడు నల్లాటి సూరీడు
నలుపు నలుపు సూరీడు
గెలుపుదారి సూరీడు
(నల్ల సూరీడు నుంచి)
కవితాయాత్రలో
2004 సెప్టెంబరులో శివసాగర్ కవిత్వం, ఒంటరి యుధ్ధమే-జీవితోత్సవం (నా రెండో పుస్తకం) ఒకేసారి రావడం అనుకోకుండా జరిగిన సాహిత్య ఘటన. అప్పటికి నేను కవితాయాత్రకు సిద్ధమయ్యాను. ఆయన ఎవరో తెలియకుండా ఏళ్లుగా, ఆయనను చూడాలని ఏళ్లుగా తపించిన నేను ఆయనతో కలిసి కవితాయాత్ర చేసే అవకాశం వచ్చింది. అన్నీ మరిచి కవిత్వం కోసమే సంచరించిన కాలమది. రెండు, మూడు నెలలపాటు ఇద్దరం యాత్ర చేశాం. నల్లగొండ నుంచి కరీంనగర్ మీదుగా గుంటూరులోని చుండూరు వరకు. ఆ అనుభవాలు మధురమైనవి, మరచిపోలేనివి. ఆయన నుంచి, కవిత్వం నుంచి నేను పొందిన అపురూపమైన బహుమతి అది. ఒక రకంగా నా పునరుత్థానం అది. ఫీనిక్స్ పక్షిలా మరో పుట్టుక అది.
ఆయన కోర్కెలు
ఆ నిరాడంబర జీవికి, అందం అంటే అడవి అంటే ప్రాణం అనుకునే అయనకు రెండు కోర్కెలు ఉన్నాయి. అవి నెరవేరకుండానే పోయాడాయన. ఒకటి- అరవిందుడి 'సావిత్రి' ప్రేరణతో మరో సావిత్రి రాయాలన్నది. రెండు-ఏ ఆదిలాబాద్ ఆదివాసుల కోసం పనిచేశాడో వారి దగ్గరే తన సమాధిని ఏర్పాటు చేయాలన్నది.
ముగింపు
ఈనెల 17న ఒక విప్లవ నేత, బహుజన నాయకుడు, రెవల్యూషనరీ రొమాంటిస్టు మరణించారు. ఆయన చుట్టూ చేరి ఎందరో ఆయనకు వీడ్కోలు పలికాము. ఇక ..షరా మామూలే. ఎవరిపనిలో వారు. శ్రీశ్రీ అన్నట్లు 'ఆకాశం పడిపోకుండానే ఉంది'
ఎన్ని అద్భుత ఘటనలు జరిగినా, ఎన్ని విషాద ఘటనలు జరిగినా. ఎన్ని వీరోచిత ఘటనలు జరిగినా ఆ క్షణంలోనే ఆవిరవుతున్నాయి. స్పందన లేమి ఈ యుగ లక్షణమైపోయింది.
అన్నీ దారి తప్పాయి. అన్ని వ్యవస్థలూ దారి తప్పాయి. నివాసయోగ్యమైన భూమిని 'నరక'ప్రాయం చేసుకున్నాము. 2099 నాటికి 6 డిగ్రీల సెంటీగ్రేడు భూఉష్ణోగ్రత పెంచాలని పరుగులు తీస్తున్నారు. ఈ విధ్వంసం ఆగదు. తప్పదు. కొత్తది మొలకెత్తక తప్పదు. నూత్న మానవుడు పుట్టక తప్పదు. మరో చేగువేరా కోసం, మరో శివసాగర్ కోసం, మరో బాలగోపాల్ కోసం, మరో సాహు కోసం, మరో జార్జి కోసం, మరో భ గత్సింగ్ కోసం కాలం కడుపుతో ఉన్నది.
సూర్యాస్తమయం వృథా కాదు
సూర్యోదయం జరిగితీరుతుంది
తల్లి ప్రసవ వేదన వృథా కాదు
నూతన శిశువు జనిస్తుంది
- యింద్రవెల్లి రమేష్
99854 40002
నివాళి
http://www.andhrajyothy.com/sundaypageshow.asp?qry=2012/apr/29/sunday/nivali&more=2012/apr/29/sunday/sundaymain